madagoni surendar

Apr 12 2024, 17:27

ఓటరుగా నమోదుకు ఇంకా మిగిలింది చివరి 3 రోజులే
*ఓటరుగా నమోదుకు ఇంకా మిగిలింది చివరి 3 రోజులే*
త్వరగా స్పందించండి.. ఓటరుగా నమోదు చేయండి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు దరఖాస్తు చేసుకొని ఓటు హక్కు పొందిన వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు.

అయితే.. కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 15తో ముగియనుంది.

2006 మార్చి 31లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఇప్పటికే 18ఏళ్లు నిండినా ఓటు హక్కు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

మీ ఫోన్లోనూ కూడా
*voters.eci.gov.in* సైట్
లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రజాస్వామ్యం రక్షణ, అవినీతి వ్యతిరేక ప్రభుత్వాల కోసం యువతరం కదిలి తక్షణమే ఓటు నమోదు చేసుకోండి.

madagoni surendar

Apr 05 2024, 10:56

భారతదేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచివుండే గొప్ప దార్శనికుడు బాబు జగ్జీవన్ రామ్ బాబూ జగ్జీవన్ రామ్ 117 వ జయంతి వేడుకలోనకిరేకల్ ఎమ్మెల్యే
భారతదేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచివుండే  గొప్ప దార్శనికుడు బాబు జగ్జీవన్ రామ్

బాబూ జగ్జీవన్ రామ్ 117 వ జయంతి వేడుకలో

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ జిల్లా :- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద ఉన్న వారి విగ్రహాం వద్ద పూలమాల వేసి ఘన నివాళులర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
అనంతరం ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ.దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని.. బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తి దాయకమని, దళిత సమాజాభివృద్ధికోసం వారు చేసిన సేవలు గొప్పవని కొనియాడారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుడిగా, గొప్ప రాజకీయవేత్తగా, సామాజిక సమానత్వం కోసం తన జీవితకాల పోరాటం చేసిన సంస్కరణ శీలిగా భారతదేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచివుండే  గొప్ప దార్శనికుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉపప్రధాని పదవితో పాటు, పలు మంత్రిత్వ శాఖలు చేపట్టి ఆయా రంగాల్లో తనదైన ముద్రను, భారతదేశ పురోభివృద్ధికి పునాదులు వేసారని అన్నారు.  దళితులు, వెనుకబడిన తరగతులు, అణచివేతకు గురైన వర్గాల ఉన్నతి కోసం, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు, కార్మికోద్యమాలను నడిపారని తెలిపారు. కార్మికశాఖ మంత్రిగా, కార్మిక సంక్షేమ విధానాలకు బాటలు వేసిన బాబూ జగ్జీవన్ రామ్ ... కార్మిక లోక పక్షపాతి అని కీర్తించారు. జీవిత పర్యంతం పేదలు, పీడిత వర్గాల సంక్షేమం, హక్కుల సాధన కోసం పనిచేసిన బాబు జగ్జీవన్ రామ్ ప్రజలు ప్రేమగా పిలుచుకునే ‘బాబూజీ’ గా ప్రఖ్యాతులయ్యారని  తెలిపారు. ఈ కార్యక్రమంలో.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దైద రవిందర్,బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్  పూజర్ల శంభయ్య,టీపీసీసీ మెనీఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్,స్థానిక కౌన్సిలర్లు,నాయకులు తదితరులు పాల్గొన్నారు..

madagoni surendar

Apr 01 2024, 15:38

పూలే అంబేడ్కర్ జన జాతర సందర్భంగా రక్తదాన శిబిరం పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
పూలే అంబేడ్కర్ జన జాతర సందర్భంగా రక్తదాన శిబిరం

    పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్గొండ జిల్లా :- ఏప్రిల్ మాసం మహానీయుల మాసంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కార్యక్రమాలు నిర్వహిస్తుందని పూలే అంబేడ్కర్ జన జాతర సందర్భంగా నల్లగొండ అంబేద్కర్ భవనంలో ఏప్రిల్ 13న రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. ఈరోజు దొడ్డి కొమరయ్య భవనంలో జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 11 మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవాలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల నిబంధనలకు లోబడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో మండలాలు నియోజకవర్గ కేంద్రాల్లో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించనున్నట్లు నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు.  మహానీయుల ఆశయాలను ఆదర్శ లను నేటి యువతకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉందని తెలిపారు. దళితుల సంక్షేమం కొరకు కృషి చేస్తూనే  దళితులపై జరుగుతున్న దాడులు అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కెవిపిఎస్ పోరాడుతుందని తెలిపారు. పాలకులు మారిన ప్రభుత్వాలు మారినా దళితుల సంక్షేమం జీరో అన్నారు.  నేటికి సంక్షేమ హాస్టల్స్ కి బిల్లులు చెల్లించలేదని ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అందడం లేదని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించే స్థితి అసలే లేదని పేరుకే దళితుల సంక్షేమాన్ని కట్టుబడి ఉన్నామని ఊకదంపుడు ఉపన్యాసాలు మానుకోవాలని సంక్షేమ పథకాలు గ్రీన్ ఛానల్ ద్వారా అమలు చేయాలని తెలిపారు. జిల్లాలో దాడులు దౌర్జన్యాలకు గురైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన బాధితులకు కూడా కనీసం పరిహారం అందించడం లేదంటే పాలకుల చిత్తశుద్ధి ఏమిటో చూడాలని అన్నారు. దేశంలో మత ఉన్మాదం పెరిగిపోతుందని భారత రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు దాపరిoచాయని రిజర్వేషన్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయని ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి మొదలుకొని ఉపముఖ్యమంత్రి వరకు అవమానాలు ఎదురై ఆత్మగౌరవం దెబ్బతింటుందని అన్నారు. దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తగు గుణపాఠం చెప్పాలని లౌకిక పార్టీలను గెలిపించాలని కెవిపిఎస్ సంఘం తీర్మానించిందని తెలిపారు. రక్తదాన శిబిరం ప్రారంభకులు డాక్టర్ ధరనీధర్ ప్రముఖ కార్డియో ప్రారంభించనున్నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా భారత స్వాతంత్రం దళితుల స్థితిగతులు పైన సెమినారు నిర్వహిస్తున్నట్టు దీనికి ముఖ్యఅతిథిగా అంబటి నాగన్న హాజరవుతారని తెలిపారు. పెద్ద ఎత్తున దళిత గిరిజన మైనారిటీ బలహీనవర్గాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు విద్యార్థులు యువకులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.  ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరుష రాములు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గాదే నరసింహ బొల్లు రవీందర్ కుమార్ కోడి రెక్క మల్లయ్య ఒంటెపాక కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు తక్కెళ్ళపల్లి శ్యామ్ దొంతాల నాగార్జున దోరేపల్లి మల్లయ్య సోమలింగం నర్సింహా  శైలజ బొడ్డు బాబురావు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 31 2024, 20:32

ఇఫ్తార్ విందులో పాల్గొన్న.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ఇఫ్తార్ విందులో నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం:- పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.అంతరం నకిరేకల్ మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో  నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో నకిరేకల్ పట్టణ వివిధ వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు..

madagoni surendar

Mar 27 2024, 09:40

బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి
బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి

నల్గొండ జిల్లా :- బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి ని మంగళవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో బెహెన్ జీ కుమారి మాయావతి  ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ నియమించారు. తెలంగాణ చీఫ్ గా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్  రాజీనామా నేపథ్యంలో పార్టీ పట్ల విధేయత కలిగిన వారికి, రాజీ పడని వారికి అవకాశమిస్తే బహుజన వాదం గెలుస్తుందన్న ఆలోచనతోనే ఈ నియామకం జరిగినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి నకిరేకల్ నియోజకవర్గంలో గడపగడపకు ఏనుగు గుర్తును ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లామన్నారు.బహుజనుల కోసం కొట్లాడే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అన్నారు. బహుజనులంతా ఏకతాటిపై వచ్చి అన్ని రంగాల్లో తమ వాటా  సాధించుకోవాలన్నారు. తనకు రాష్ట్ర కమిటీ లో చోటు కల్పించిన  నేషనల్ కో ఆర్డినేటర్ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతం , రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ మరియు నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

madagoni surendar

Mar 22 2024, 18:05

బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నా... - ఎలాంటి ఘటనలు జరిగిన పార్టీ మారే ప్రసక్తే లేదు... - బీఎస్పీ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంట
బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నా...


- ఎలాంటి ఘటనలు జరిగిన పార్టీ మారే ప్రసక్తే లేదు...

- బీఎస్పీ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ...

- నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని


నల్గొండ జిల్లా :- ఎవరెన్ని ఆశలు పెట్టిన తలోగ్గేది లేదని, బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నానని నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. బహుజన వాదం అని చెప్పి, నమ్ముకున్న కార్యకర్తలను నట్టింట ముంచి మధ్యలో వదిలేసి వెళ్లిపోయారని అన్నారు.  శుక్రవారం నాడు నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీలలో నాయకులు వస్తుంటారు, పోతుంటారు నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఎవరు అదైర్య పడొద్దని, అందరికీ వెన్నంటుగా ఉండి, అండగా ఉంటానని బీఎస్పీ పార్టీ నియోజకవర్గం ఇంఛార్జి మేడి ప్రియదర్శిని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావిరాల నరసింహ యాదవ్,నియోజకవర్గ చేరికల కమిటీ కన్వీనర్స్ మునుగోటి సత్తయ్య, చెరుకుపల్లి శాంతి కుమార్, చిట్యాల మండలం అధ్యక్షులు జోగు శేఖర్, రామన్నపేట మండల ఉపాధ్యక్షులుగుని రాజు,ప్రధాన కార్యదర్శి నకిరేకంటి  నరసింహ, మండల కోశాధికారి గట్టు రమేష్,మండల మహిళా కన్వీనర్,బందెల అనిత, నాయకులు బాలాగోని మల్లయ్య గౌడ్,బుస్సు శ్రీకాంత్,రవి,యోగి, రామ్ కుమార్  బిఎస్పి నాయకులు తదితరులు పాల్గొన్నారు

madagoni surendar

Mar 19 2024, 16:25

మల్లు స్వరాజ్యం ఆశయాలను కొనసాగిస్తాము. పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా కార్యదర్శి

మల్లు స్వరాజ్యం ఆశయాలను కొనసాగిస్తాము.
   
పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా కార్యదర్శి

*ద్వితీయ వర్ధంతి సందర్భంగా జీకే అన్నారంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహణ*
నల్గొండ జిల్లా :-
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శమని వారి ఆశయాలు కొనసాగిస్తామని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు.  ఈ రోజు జీకే అన్నారం గ్రామంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) నల్గొండ ఆధ్వర్యంలో *సంకల్ప హాస్పిటల్ , ప్రభుత్వ PHC రాములబండ వారి సహకారంతో*  ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ ఆనాడు దున్నేవాడికే భూమి కావాలని పెట్టి చాకిరి విముక్తి కావాలని మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల వ్యతిరేకంగా నిలబడి తుపాకీ బట్టి పోరాడిన మల్లు స్వరాజ్యం జీవితం నేటి యువతరానికి ఎంతో ఆదర్శమని అన్నారు.  భూమి భుక్తి విముక్తి పోరాటాలు ద్వారానే నిజాం నిరంకుశ జాగీర్ దేశముకుల పాలన అంతమైందని అన్నారు. మల్లు స్వరాజ్యం తన పదకొండవ ఏట నుండి ప్రజా ఉద్యమాలలో పాల్గొని తుంగతుర్తి కి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తన జీవితాంతం ప్రజల కోసం పోరాడిందని అన్నారు.   నేటి పాలకులు మద్యం మత్తు పదార్థాలు నియంత్రించడంలో ఘోరంగా విఫలం చెందుతున్నాయని అన్నారు.
ప్రజలు  విద్యా వైద్యం ఉపాధి కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు.  ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని గ్రామాలలో వృద్ధులు పిల్లలు సరియైన పౌషక ఆహారము లేక సరియైన వైద్యం చేయించుకోలేక రోగాల బారిన పడుతున్నారని అన్నారు.  ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా అత్యధిక మంది ప్రజలు తమ ఆరోగ్యాలను పరీక్షించుకొని ఉచితంగా మందులు పొందారని అన్నారు.  రాములబండ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రభుత్వం వారిచే డాక్టర్ తిరుమల్ డాక్టర్ భాస్కర్  పద్మ సూపర్వైజర్ మరియు నల్లగొండ పట్టణం ప్రకాశం బజార్ లో గల సంకల్ప ఆసుపత్రి బృందం డాక్టర్ కరీముల్లా జనరల్ ఫిజీషియన్  డాక్టర్  లీనా మాధురి గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రజ్వల చిన్న పిల్లల డాక్టర్లు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున కమిటీ సభ్యురాలు కొండ అనురాధ గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న మండల కమిటీ సభ్యులు బోల్లు రవీందర్ కుమార్ సంకల్ప ఆసుపత్రి సహాయకులు రాము శ్రీకాంత్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
కొండ అనురాధ,
రాష్ట్ర కమిటీ సభ్యురాలు
ఐద్వా నల్లగొండ తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 18 2024, 19:08

*డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన డ్రైవర్లు*
*డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన డ్రైవర్లు* నల్గొండ జిల్లా :-
కట్టంగూర్ మండల కేంద్రనికి చెందిన డ్రైవర్ చెరుకు శంకర్
ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబానికి తోటి డ్రైవర్లు, ఓనర్లు చేయితన అందించారు. వారందరూ కలిసి సేకరించిన  22వేలను సోమవారం నాడు చెరుకు శంకర్  కుటుంబానికి అందజేసిన వారు.చెరుకు సైదులు(మడేల్ )ఓరుగంటి హరిబాబు,డిసిఎం ఓనర్లు డ్రైవర్లు,చెరుకు కాశీనాథ్,దాసరి శివ,వీరమళ్ల నగేష్,పలస రాజు, చితలూరు అశోక్,రెడ్డిపల్లి, వెంకన్న,చెరుకు సైదులు, అమరబోయిన వెంకన్న, చెరుకు మల్లికార్టున్,చెరుకు సత్యం,పోడిచేటి కృష్ణ, వెంకన్న ఇనుపాముల, జంజారాల నగేష్,గట్టిగోర్ల అంజి,చిక్కుల్ల లింగస్వామి, చిక్కుల్ల సైదులు,నర్సింగ్ శ్రీను,పోడిచేటి కృష్ణ, ఉంజరాల కృష్ణ,నడిగోటి కృష్ణ,బొల్లం వెంకన్న, చెరుకు రవి (యోగి),చెరుకు రమేష్, గట్టిగొర్ల రాజు,చితలూరి. సైదులు,కొంపల్లి నాగారాజు,పోడిచెటి శ్రీను, పోడిచెటి లింగయ్య,మండ యదయ్య,గదగోని వెంకన్న, చెరుకు రవి(ఆర్.టి.సి ),తేలు శంకర్,యారకల సత్యనారాయణ చెరుకు రవి, తదితరులు ఉన్నారు.

madagoni surendar

Mar 08 2024, 18:12

మహాశివుని కరుణాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలి*. *మహశివరాత్రి వేడుకలో* నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
*మహాశివుని కరుణాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలి*.

*మహశివరాత్రి వేడుకలో*

నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం
నల్గొండ జిల్లా :-
నకిరేకల్ నియోజకవర్గం.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు, నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు, కట్టంగూర్ మండల కేంద్రంలోని శివాలయంలో స్వామి వారిని నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి  ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీ ఒక్కరిలో  ఆత్మశుద్దిని, పరివర్తనను కలిగిస్తాయని అన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని కోరారు.  మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలనీ  ప్రార్థించారు. లయకారునిగా, అర్ధనారీశ్వరునిగా, హిందువులు కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

madagoni surendar

Mar 07 2024, 11:49

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
*నల్గొండ. స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత*
నల్గొండ జిల్లా:-
నల్గొండ జిల్లా గుండ్లపల్లి గ్రామానికి చెందిన శంకర్ ఇటీవల మృతి చెందాడు. ఈసందర్బంగా నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2012-15 బ్యాచి కి చెందిన శంకర్ స్నేహితులు గురువారం గుడ్లపల్లి గ్రామం లోని శంకర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయన్ని అందజేశారు. కలిసి చదువుకున్న స్నేహితులు ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు.